సోషల్ మీడియాలో తన బోల్డ్ నెస్ తో ఎంతో పాపులర్ అయిన బాలీవుడ్ నటి పూనమ్ పాండే. ఈ సెప్టెంబర్ 10న తన మిత్రుడు, రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న శామ్ బాంబేను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే.. పెళ్లై రెండు వారాలు కాకముందే వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఆమె ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. శామ్ బాంబే తనను వేధిస్తూ, హింసిస్తున్నాడంటూ గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శామ్ బాంబేను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సెన్సేషన్ గా మారింది.


తనను శామ్ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, దాడి కూడా చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది పూనమ్. సోమవారం అర్ధరాత్రి ఈమేరకు శామ్ పై కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు శామ్ ను దక్షిణ గోవాలోని కొనకొనలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై పోలీసులు స్పందిస్తూ.. ‘పూనమ్ ఓ షూటింగ్ నిమిత్తం గోవా వచ్చారు. శామ్ తనపై దాడి చేశాడని, వేధించి బెదిరించాడంటూ సోమవారం అర్ధరాత్రి కేసు పెట్టింది పూనమ్. పెళ్లైన రెండు వారాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమేంటో.. దాడి చేసే పరిస్థుతులేంటో అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నా’మని ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ వెల్లడించారు.


ఈ నేపథ్యంలో పూనమ్ ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కొద్దిమంది అతిధుల మధ్య ఈ నెల 10న పెళ్లి చేసుకున్న పూనమ్ – శామ్ బాంబే ప్రస్తుతం గోవాలో హనీమూన్ లో ఉన్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూనమ్ తో దిగిన ఫొటోలను శామ్ బాంబే  తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. మరి.. వీరిద్దరి మధ్య ఇంత తక్కువ సమయంలో మనస్పర్ధలకు కారణాలేమిటో విచారణలో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: