ఇక ఈ సినిమా కథ కథనాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా, మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ను కూడా ఎంతో అలరించేలా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు క్రిష్. కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పాత్ర ఎంతో అదిరిపోతుందని, అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాబోయే దీపావళి అనంతరం ప్రారంభం కానుందని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ ని రూపొందిస్తున్నారని అతి త్వరలో అది పూర్తవుతుందని ఆ వెంటనే సినిమాని పట్టాలెక్కిస్తారని టాక్. మరోవైపు వకీల్ సాబ్ సినిమాలో కూడా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తుది దశకు చేరుకోవడంతో అక్కడి నుండి వరుసగా కొన్నాళ్ళపాటు క్రిష్ సినిమాలో నటించనున్నారని, వకీల్ సాబ్ సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి తొలిసారిగా పవన్, క్రిష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!