పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా లాక్ డౌన్ కి ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా ప్రముఖ స్టార్ హీరోయిన్ ఒకరు నటిస్తున్నట్లు సమాచారం. ప్రఖ్యాత నిర్మాత ఏం రత్నం నిర్మాణ సంస్థ అయిన మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యధిక ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామా మూవీలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కథ కథనాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా, మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ను కూడా ఎంతో అలరించేలా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు క్రిష్. కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పాత్ర ఎంతో అదిరిపోతుందని, అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాబోయే దీపావళి అనంతరం ప్రారంభం కానుందని సమాచారం.

ఇప్పటికే  ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ ని రూపొందిస్తున్నారని అతి త్వరలో అది పూర్తవుతుందని ఆ వెంటనే సినిమాని పట్టాలెక్కిస్తారని టాక్.  మరోవైపు వకీల్ సాబ్ సినిమాలో కూడా నటిస్తున్న పవన్ కళ్యాణ్సినిమా తుది దశకు చేరుకోవడంతో అక్కడి నుండి వరుసగా కొన్నాళ్ళపాటు క్రిష్ సినిమాలో నటించనున్నారని, వకీల్ సాబ్ సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి తొలిసారిగా పవన్, క్రిష్ ల  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: