అడవి శేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అన్న పేరును సంపాధించుకున్నాడు. గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. ఇతడు కొత్తగా ‘మేజర్’ అనే సినిమాను తెరకెక్కించేందకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఆ టెర్రర్ అటాక్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించనున్నారు.

 ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీ బ్యానర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాయి. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అడవి శేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మేజర్ సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగాయనే ఆసక్తికర విషయాలను అడవి శేష్ వెల్లడించారు.

‘మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథ 2008 నుంచే తన మదిలో ఉందని ఆయన చెప్పారు. 26/11 ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు తాను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నానని, అక్కడి వార్తా చానెళ్లలో 27తారీకు మధ్యాహ్నం కృష్ణన్ ఫొటో చూశానని చెప్పారు. అప్పటి నుంచి ఆయనపై వచ్చిన ప్రతి వార్తను కత్తిరించి పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటర్వ్యూను కంప్యూటర్లో దాచుకొని చదువుకునేవాడిని అని తెలిపారు. ఎప్పటికైనా ఇలాంటి సినిమా తీయడమే తన కోరిక అని శేష్ అంటున్నాడు.

 ‘మనం చేయాలకున్న పనిమీద నమ్మకం.. ఆ పనిచేసేటప్పుడు మన సిన్సియారిటీ ఈ రెండు మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి నమ్ముకుంటే చాలని నమ్మి లుక్ టెస్ట్‌కు వెళ్లానని అడవి శేష్ అన్నాడు. ఇందులో మేజర్ సందీప్ ముఖం సగం, శేష్ ముఖం సగం ఉండేలా పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోను చూపించారు. ఈ సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వచ్చే నెల 17న విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: