ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..లాక్ డౌన్ తరువాత  యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుచుకునే  అవకాశాన్ని ప్రభుత్వం  కల్పించడం జరిగింది. దీంతో చాలా  సాహసం చేసి కొత్త సినిమాలను విడుదల చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి మంచి స్పందన రావడంతో ఇప్పుడు సంక్రాంతికి నాలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో నాలుగు సినిమాలంటే రెవెన్యూ తక్కువ వస్తుందేమో అనే భయం చాలా మందిలో ఉంది.

అయితే ఈ కరోనా  సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు పూర్తి శాతం ఆక్యుపెన్సీ దక్కేలా ఉంది. తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు కూడా వంద శాతం ఆక్యుపెన్సీ కోసంప్రయత్నిస్తున్నాయి. టాలీవుడ్ సినీ పెద్దలు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతల మండలి తరఫున అధికారికంగా ప్రభుత్వానికి విన్నపం కూడా పంపించేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా సినిమా పరిశ్రమకు 100 శాతం  ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతుంది.తెలుగు సినిమాలకు సంక్రాంతి అతి పెద్ద పండుగ.ఆ సమయానికి గనుక వంద శాతం ఆక్యుపెన్సీ ఇస్తే.. ఆర్థికంగా సినిమాలకు లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.

 కానీ కరోనా కాలంలో వంద శాతం ఆక్యుపెన్సీ అంటే ప్రేక్షకులు ఈ కరోనా టైంలో వచ్చి చూసేందుకు ఎంత ధైర్యం చేస్తారో చూడాల్సింది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: