గత కొన్ని రోజులుగా రాకేష్‌ మాస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. చిరంజీవి మొదలు గుర్తు వచ్చిన వారినల్లా బూతులతో సైతం విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఒకానొక సమయంలో మగ శ్రీ రెడ్డి అని జనాలు ఆయనకు స్టాంప్ వేసేశారు. అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. ఇప్పటికే రాకేష్‌ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో లీగల్ నోటీసులు పంపారు. తనను సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో చిత్రీకరించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.


తరచూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే హీరోయిన్  పొలిటీషన్ మాధవి లత ఆమె ఏమి చేసిన సంచలనం అవుతున్నాయి..శ్రీ రెడ్డి తో సాదినేని యామిని వివాదం..చిత్రపురి లో జరిగే అన్యాయాల గురించి అయినా సోషల్ మీడియా లో ఆమె పోస్ట్ లు బాగా వైరల్ అయ్యాయి.లాక్ డౌన్ లో సెలబ్రెటీల పెళ్లిళ్ల మీద స్పందించింది ‘ఆ మాత్రం ఆకలేకపోతున్నారా ‘ బాబు అంటూ.ఇకపోతే తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.


ఇటీవలే చిరంజీవి గారి మీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వారి ఫాన్స్ కి టార్గెట్ అయ్యారు.ఒక వీడియోలో మాట్లాడుతూ సినిమా నటీనటులు ప్రజలకు సహాయం చేయాలంటూ విమర్శించడమే కాకుండా మాధవి లత మీద కూడా అసభ్యకరంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోని యు ట్యూబ్ లో పెట్టారు …ఆ వీడియో పై ప్రతిస్పందిస్తూ రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులు పంపారు..ఆ వ్యాఖ్యలు తనను అవమానించేలా మాట్లాడరు అంటూ తెలిపారు తక్షణమే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు మాధవి లత తరుపున న్యాయవాది ఇటీవలే తన క్లయింట్ మాధవి లత మీద నిందలు వేశారని.అసభ్య పదజాలంతో దూషించారని తెలుగు సినిమా ప్రముఖులు అయిన చిరంజీవి,బాల కృష్ణ తో లింకులు పెట్టడడమే కాకుండా తన గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: