బుల్లితెర కార్య క్రమాలు చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు.. ఇప్పటికే ఎన్నో రకాల బుల్లితెర కార్య క్రమాలు ఈటీవీ లో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇటీవలే వినూత్నమైన కాన్సెప్టుతో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి వారం కూడా సరికొత్త గెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.
గత కొన్ని ఎపిసోడ్లలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి యాంకర్గా చేస్తున్న సింగర్ రేవంత్ రాగా.. ఇక అతని స్థానం లో సుడిగాలి సుదీర్ తోపాటు యాంకర్ శ్రీముఖి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి ఎంతో మందిని ఆకర్షిస్తుంది . ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా ఒకానొక సమయం లో యాంకర్ శ్రీముఖి ని పొరపాటున పక్కకు నెట్టేస్తాడు సుధీర్. దీంతో శ్రీముఖి అమ్మ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటి అన్నపూర్ణ వచ్చి సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.