బుల్లితెర కార్యక్రమాలకు ఉన్నక్రేజ్ గురించి ప్రశత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు  సినిమాల కంటే బుల్లితెర కార్యక్రమాలను చూడటానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలం లో వస్తున్న కార్య క్రమాలు అన్నీ కూడా సరికొత్త కాన్సెప్ట్ తో వస్తూ ఉండటం అందరికీ కూడా వినూత్నమైన కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉండటం లాంటివి జరుగుతుంది. అందుకే  ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అందించే కార్య క్రమాలను చూడటానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఇప్పటికే ఈటీవీలో ఇప్పటికే ఎన్నో రకాల ఇతర కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.


 బుల్లితెర కార్య క్రమాలు చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు.. ఇప్పటికే ఎన్నో రకాల బుల్లితెర కార్య క్రమాలు ఈటీవీ లో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇటీవలే వినూత్నమైన కాన్సెప్టుతో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి వారం కూడా సరికొత్త గెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.



 గత కొన్ని ఎపిసోడ్లలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి యాంకర్గా చేస్తున్న సింగర్ రేవంత్ రాగా.. ఇక అతని స్థానం లో సుడిగాలి సుదీర్ తోపాటు యాంకర్ శ్రీముఖి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక  ఇటీవల విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి ఎంతో మందిని ఆకర్షిస్తుంది  . ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా ఒకానొక సమయం లో  యాంకర్ శ్రీముఖి ని  పొరపాటున  పక్కకు నెట్టేస్తాడు సుధీర్. దీంతో శ్రీముఖి అమ్మ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటి అన్నపూర్ణ  వచ్చి సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: