శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ ఇండస్ట్రీ కి వచ్చింది. రావటంతోనే వరుసగా హిందీలో సినిమాల లో గ్లామర్ పాత్రలు చేస్తూ తరువాత తెలుగు తమిళ భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు శృతిహాసన్ తెలుగులో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నది ఈ హాట్ బ్యూటీ... ఇక ఆ తరువాత వరుస హిట్ల సినిమాలు చేసి పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది శృతి హాసన్..అటు దేశవ్యాప్తంగా పలు హిట్ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.ఇక మళ్ళీ కుర్ర హీరోయిన్ లు పోటీ ఇవ్వడంతో ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయాయి.మళ్ళీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మాస్ మహారాజా క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ అందుకున్నారు. అయితే క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ సాధించినా ఆ సినిమాకు శృతి పాత్ర ప్లస్ కాలేకపోయింది.



నిన్న విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతి పాత్ర తేలిపోయింది. శృతి పాత్ర సినిమాలో లేకపోతే సినిమా మరింత బాగుండేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రిటిక్స్ సినిమాలో శృతి పాత్ర, నటన బాలేదంటూ అభిప్రాయపడుతున్నారు.దీంతో అటు ఫ్యాన్స్ ని మెప్పించలేక ఇటు విమర్శకులని మెప్పించలేక అనవసరంగా వకీల్ సాబ్ లో నటించి పరువు పోగొట్టుకుందని శృతి బాధ పడుతుందట..ఇక ఈ నేపథ్యంలో శృతి మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.ఎందుకంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక శృతిని హీరోయిన్ గా తీసుకుంటే రెబల్ స్టార్ వాల్యూ తగ్గిందట. అందుకని రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాకొద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ ఎఫెక్ట్ తో శృతికి ఆఫర్లు పోయేలాగ వున్నాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: