ఇంటర్నెట్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. వారిలో కొంతమంది స్టార్లుగా ఎదిగితే మరికొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే కనుమరుగైపోతుంటారు. టాలీవుడ్‌లోనూ ఇలాంటి హీరోయిన్‌లు చాలామంది ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ సరసన నటించిన హీరోయిన్లలోనూ ఇలాంటి వారున్నారు. తాజాగా పవన్‌తో నటించిన ఓ హీరోయిన్ మీడియా కంట పడింది. పవన్‌తో కలిసి బాలు సినిమాలో నటించిన నేహా ఓబెరాయ్ ఆమె. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు చిత్రంలో నేహా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా శ్రియ శరన్ నటించగా రెండో కథానాయికగా నేహ నటించింది.

నేహా ఒబెరాయ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా పరిశ్రమకి వచ్చింది. కాగా అప్పటికే నేహా ఒబెరాయ్ తండ్రి ‘ధరమ్ ఒబెరాయ్’ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాతగా బాగానే రాణిస్తున్నాడు. దీంతో నేహా ఒబెరాయ్‌కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతోనే బాలు చిత్ర ఆడిషన్స్‌లో హీరోయిన్ పాత్ర కోసం పాల్గొంది.

అయితే ఈ చిత్రంలో ఈ అమ్మడు నట్టించిన సన్నివేశాల నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చిత్రానికి హైలెట్ గా నిలిచాయి దాంతో జగపతిబాబు హీరోగా నటించిన “బ్రహ్మాస్త్రం” చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో నేహ మళ్లీ ఎవరికీ కనిపించలేదు. కానీ ఏడాదికి ఒక సినిమా చొప్పున మూడు సినిమాలలో నటించి బాలీవుడ్‌లో అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరించింది. అయినప్పటికీ హీరోయిన్‌గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే 2010లో ప్రముఖ వ్యాపార వేత్త విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన భర్తకి వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటోంది. అంత బాలీవుడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటకీ నేహ సినిమాల్లో రాణించలేకపోవడం ఆశ్చర్యం కలిగించినా.. ఆమె ప్రస్తుతం ఆనందంగానే ఉండడం సంతోషం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: