ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ హరితేజ.. దీనికి గాను ఆమెకు తన అభిమానులనుంచి శుభకాంక్షలు వెల్లువెత్తుగా ఆమె వారసురాలిని చూడడానికి అభిమానులు అప్పటినుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ అభిమానుల కోరికను విన్న హరితేజ తాజగా తన గారాలపట్టి ఫోటోను రిలీజ్ చేసింది.. పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. సినిమా లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది..

సినిమా తోనే ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది అని చెప్పొచ్చు.ఈ సినిమా లో సమంత తో కలిసి ఫుల్ లెన్త్ రోల్ చేసిన హరితేజ మంచి గుర్తింపు తో పాటు క్రేజ్ ని కూడా దక్కించుకుంది.. అంతకుముందు వందలకొద్దీ సీరియల్స్ చేసినా ఆమెకు పెద్ద గా గుర్తింపు అయితే రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొన్న హరితేజ కొద్దో గొప్పో గుర్తింపు దక్కించుకుంది. కానీ ఆ సినిమా తో అందరికి సుపరిచయమైంది.  ప్రస్తుతం వెండితెరపైనే, బుల్లితెరపైనా దూసుకుపోతుంది. అంతేకాదు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అందులో షేర్ చేస్తూ బాగా సంపాదిస్తుంది కూడా..

కాగా తాజాగా ఆమె తన గారాల పట్టీని ప్రపంచానికి పరిచయం చేసింది. తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తాను ఎంతో క్యూట్ గా ఉందని వెల్లడించారు. అచ్చం నీలాగే ఉందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. 2015 లో దీపక్ ను పెళ్లి చేసుకున్న హరితేజ ఆ తర్వాత తన సంసారం జీవితం ఎంతో ఆనందంగా ఉన్నట్లు పలుమార్లు తెలిపింది. వారి పండంటి సంసారానికి ఫలితంగా ఆడబిడ్డ పుట్టింది.. దీంతో వారింట్లో సంతోషాలు వెల్లివిరిసినట్లయ్యింది.. మరి ఆ పాప పేరును ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: