బుల్లితెర యాంకర్ వర్షిణి గురించి తెలియని వారంటూ ఉండరు. చందమామ కథలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ'తో టెలివిజన్ రంగంలోకి అడుగెట్టింది. ‘ఢీ' షోలో గతంలో వర్షిణి ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా యాంకర్ వర్షిణి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇందులో యాంకర్ వర్షిణి ఓ వ్యక్తితో కలిసి దిగినటువంటి ఫోటోని తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో వర్షిణి తో పాటూ ఉన్నటువంటి వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ యాంకర్ వర్షిణి  ప్రస్తుతం ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ యాంకర్ వర్షిణి  మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు.


అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలోకూడా వర్షిణి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని ఇందులో భాగంగా వీరిద్దరూ 2017వ సంవత్సరంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ నిశ్చితార్థం క్యాన్సల్ అయిందని టాక్ వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి కూడా యాంకర్ వర్షిణి స్పందించక పోవడం గమనార్హం.

ఇక ఇప్పటికైనా యాంకర్ వర్షిణి తన ప్రేమ, పెళ్లి విషయాలపై వస్తున్నటువంటి వార్తలు గురించి స్పందిస్తుందో లేదో చూడాలి. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిణి  పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే షోలు, ఈవెంట్లు, చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అంతేకాకుండా తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: