మెగా హీరో సాయి ధరం తేజ్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం దేవా కట్టా డైరక్షన్ లో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆఫ్టర్ లాక్ డౌన్ స్టార్స్ అంతా పనులు మొదలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటే మెగా మేనల్లుడు ఆల్రెడీ తన డ్యూటీ ఎక్కేశాడు. రిపబ్లిక్ సినిమా కోసం సాయి ధరం తేజ్ డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది ఈ విషయాన్ని సాయి ధరం తేజ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ప్రస్థానం సినిమా తరహాలోనే మరోసారి తన మార్క్ సినిమా చేస్తున్నాడు దేవా కట్టా. రిపబ్లిక్ అంటూ వ్యవస్థలోని లోటు పాట్లని వేలెత్తి చూపించబోతున్నాడు. అంతేకాదు సినిమాలో డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా ఉంటాయని అంటున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ డబ్బింగ్ పూర్తి చేయగానే సినిమా ఫైనల్ మిక్సింగ్ చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సి ఉన్న కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాతో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు దేవా కట్టా. సాయి ధరం తేజ్ కూడా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నిరాశపరచింది కాబట్టి ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. సుకుమార్ కూడా ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నాడని టాక్.






మరింత సమాచారం తెలుసుకోండి: