స్వాతిముత్యం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర సీమకు సంబంధించి అది ఒక అద్భుతమైన కలాఖండం. ఈ రోజుకీ తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పాలంటే ఆ వరసలో వచ్చేచిత్రాలలొ కచ్చితంగా స్వాతిముత్యం కూడా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీని శంకరాభరణం నిర్మించిన ప్రఖ్యాత సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ మూవీకి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఈ మూవీ అనుకున్నపుడు మొదట చంద్రమోహన్ ని హీరోగా  పెట్టాలనుకున్నారుట. ఎందుకంటే ఈ సినిమాలో హీరో కాస్తా బుద్ధి మాంద్యంతో ఉన్న వాడు. చంద్రమోహన్ అయితే ఆ భావాన్ని తన మొహంలోనే పలికిస్తారు అని  భావించారుట. అంతే కాదు అప్పటికే చంద్రమోహన్ శ్రీదేవి సూపర్ హిట్ మూవీ పదహారేళ్ల వయసు కూడా ఉంది.

అందులో కూడా ఆయన మూగవాడిగా అమాయకుడిగా నటించి మెప్పించారు. దాంతో పాటు కె విశ్వనాధ్ కి చంద్రమోహన్ కి మధ్య  మంచి అనుబంధం ఉంది. ఇద్దరి కాంబోలో చక్కని  హిట్లు వచ్చాయి కూడా. ఇలా అన్నీ ఆలోచించుకున్నారు. ఆ విషయం చంద్రమోహన్ కి కూడా చెప్పి కాల్షీట్లు తీసుకున్నారుట. అయితే ఎందుకో అనూహ్యంగా చిత్ర యూనిట్ మనసు కమల్ హాసన్ మీద పడిందట. ఆయన ఓకే అంటే హీరో ఆయనే అనుకున్నారుట. అప్పటికే పూర్ణోదయ వారి బ్యానర్ లో కమల్ హసన్ సాగర సంగమం చేయడంతో పాటు విశ్వనాధ్ కి కూడా బాగా క్లోజ్ అయిపోయారు. దాంతో ఈ మూవీకి కమల్ ఓకే అనేశారుట. అలా ఈ మూవీలో కమల్ వచ్చి చేరారు అని ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీలో తనను మొదట అనుకుని తరువాత పక్కన పెట్టడంతో చంద్రమోహన్ కె విశ్వనాధ్ మీద అలిగి ఆ తరువాత ఆయన దర్శకత్వంలో చిత్రాలు చేయలేదు అన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి చంద్రమోహన్ కి మంచి చిత్రమే అలా మిస్ అయింది అనుకోవాలేమో.





మరింత సమాచారం తెలుసుకోండి: