హీరోయిన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడడం చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్ డ్రామా క్వీన్ గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తాజాగా ఈ బ్యూటీ ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ విషయంపై ఆమె పోలీసులను సంప్రదించినట్టు  సమాచారం. రాఖి సావంత్ అభిమానిగా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి తలుపు తాళం పగలగొట్టి, ఇంట్లోకి చొరబడ్డాడని తెలుస్తోంది. ఆ తర్వాత నటి ఈ విషయంపై పోలిసుల సహాయంతో చర్యలు తీసుకుంది. అయితే ఈ ఘటన ఆమె ఇంట్లో లేనప్పుడు జరిగింది. కానీ అదే సమయంలో ఆమె ఇంట్లో ఉన్న ఓ అమ్మాయి గాయపడిందని తెలుస్తోంది. .

ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకొని తాళం పగలగొట్టాడని, ఈ విషయంపై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. అతనో పిచ్చివాడని, ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని ఫైర్ అయ్యింది. ఫ్యాన్ అని అంటున్నాడని, నిజంగా ఎవరినైనా అభిమానిస్తే  వాళ్ళ మంచి కోరుకుంటారు. కానీ ఇలా తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి చొరబడరు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. కానీ ఇతను చేసిన పనికి ఇంట్లో ఉన్న అమ్మాయి భయపడింది, గాయపడింది అని అసలు విషయాన్ని వెల్లడించింది. రాఖీ సావంత్ మాట్లాడిన వీడియోను ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నాడు. ఇప్పుడు రాఖీ అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని నటిని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

బిగ్ బాస్ 14 నుండి రాఖీ సావంత్ బయటకు వచ్చినప్పటి నుండి ఆమె అదృష్టం మరోసారి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా 'లాక్‌డౌన్', 'డ్రీమ్ మే ఎంట్రీ' వంటి సాంగ్స్ లో ఈ బ్యూటీ మెరిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: