ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకొని తాళం పగలగొట్టాడని, ఈ విషయంపై ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. అతనో పిచ్చివాడని, ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని ఫైర్ అయ్యింది. ఫ్యాన్ అని అంటున్నాడని, నిజంగా ఎవరినైనా అభిమానిస్తే వాళ్ళ మంచి కోరుకుంటారు. కానీ ఇలా తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి చొరబడరు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. కానీ ఇతను చేసిన పనికి ఇంట్లో ఉన్న అమ్మాయి భయపడింది, గాయపడింది అని అసలు విషయాన్ని వెల్లడించింది. రాఖీ సావంత్ మాట్లాడిన వీడియోను ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నాడు. ఇప్పుడు రాఖీ అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని నటిని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
బిగ్ బాస్ 14 నుండి రాఖీ సావంత్ బయటకు వచ్చినప్పటి నుండి ఆమె అదృష్టం మరోసారి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా 'లాక్డౌన్', 'డ్రీమ్ మే ఎంట్రీ' వంటి సాంగ్స్ లో ఈ బ్యూటీ మెరిసింది.