ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలలో సినిమాలను విడుదల చేసే ముందు కొత్త కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఈ కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసిన.. ఫలితం లేకపోవడంతో.. ఈ చిన్న సినిమా బృందం బాగా ఆలోచించి.. ఈ సినిమాను ఫ్రీ గా చూడవచ్చు అంటూ విస్తృత ప్రచారం తో మొదలు పెట్టింది. ఇలా చెప్పడం వలన ప్రేక్షకులలో ఈ సినిమా గురించి హైప్ బాగా పెరుగుతుందని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచించారు. ఆ సినిమా పేరు.."ది కిల్లర్".
ఈ సినిమాను వచ్చే నెల మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోగా కార్తీక్ సాయి నటిస్తున్నాడు. తానే ఈ సినిమాని డైరెక్ట్ చేసి, విడుదల చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ గా డాలీషా, నేహాదేశ్ లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆవుల రాజా యాదవ్, వాసుదేవరావు నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్భంగా.. ఈ చిత్ర యూనిట్ ఆరోజు ఉదయం మార్నింగ్ షో ను థియేటర్లలో ఉచితంగా చూడవచ్చని ప్రకటించింది.
ఇక అంతే కాకుండా ఈ సినిమా ఎక్కడైనా ఉచితంగానే చూడవచ్చని తెలియజేసింది. అలా చూసిన తర్వాత ఈ సినిమా గురించి కేవలం కొందరికి చెపితే చాలని చిత్రయూనిట్ తెలిపింది. ఏది ఏమైనా ప్రమోషన్స్లో భాగంగా చేసిన వినూత్నమైన ఆలోచన చాలా బాగుంది అంటూ కొంత మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.