ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాయి. ఇక ఆ సినిమాను విడుదల చేసేందుకు ఆ యూనిట్ సభ్యులు ఎంతో రసవత్తరంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక సినిమా గురించి తెలిస్తే మొత్తమంతా ఆశ్చర్యపోతారు. ఈ సినిమాను ప్రమోషన్స్ లో భాగంగానే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్స్. అది ఏమిటంటే ఈ సినిమాని థియేటర్ లలో ఫ్రీగా చూడవచ్చట. అయితే ఆ సినిమా విశేషాలను చూద్దాం.


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలలో సినిమాలను విడుదల చేసే ముందు  కొత్త కొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఈ కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసిన.. ఫలితం లేకపోవడంతో.. ఈ చిన్న సినిమా బృందం బాగా ఆలోచించి.. ఈ సినిమాను ఫ్రీ గా చూడవచ్చు అంటూ విస్తృత ప్రచారం తో మొదలు పెట్టింది. ఇలా చెప్పడం వలన ప్రేక్షకులలో ఈ సినిమా గురించి హైప్ బాగా పెరుగుతుందని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచించారు. ఆ సినిమా పేరు.."ది కిల్లర్".

ఈ సినిమాను వచ్చే నెల మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోగా కార్తీక్ సాయి నటిస్తున్నాడు. తానే ఈ సినిమాని డైరెక్ట్ చేసి, విడుదల చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ గా డాలీషా, నేహాదేశ్  లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆవుల రాజా యాదవ్, వాసుదేవరావు నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్భంగా.. ఈ చిత్ర యూనిట్ ఆరోజు ఉదయం మార్నింగ్ షో ను థియేటర్లలో ఉచితంగా చూడవచ్చని ప్రకటించింది.

ఇక అంతే కాకుండా ఈ సినిమా ఎక్కడైనా ఉచితంగానే చూడవచ్చని తెలియజేసింది. అలా చూసిన తర్వాత ఈ సినిమా గురించి కేవలం కొందరికి చెపితే చాలని చిత్రయూనిట్ తెలిపింది. ఏది ఏమైనా ప్రమోషన్స్లో భాగంగా చేసిన వినూత్నమైన ఆలోచన చాలా బాగుంది అంటూ కొంత మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: