చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్పీడు మామూలుగా లేదు అని చెప్పవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా చిరంజీవి మొదట 'ఖైదీ నెంబర్ 150' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి కి బ్లాక్ బస్టర్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెంటనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' అనే సినిమాలో నటించి దానిని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి కుర్ర హీరోలకు నేనేమి తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు. ఇలా రెండు వరుస బ్లాక్ బస్టర్ లతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాతో పాటు, మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయి.

అలాగే ప్రముఖ కళాకారుడు అయిన గద్దర్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మలయాళం సూపర్ హిట్ 'లూసిఫర్' రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో విద్యాబాలన్ చిరంజీవికి చెల్లెలి  పాత్రలో నటించబోతోంది అని వార్త వినబడుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిందే. చిరంజీవి ఈ సినిమాలతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ గా తెరకెక్కుతున్న 'బోలా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. మరియు బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి చిరంజీవి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: