అయితే కరోనా కాస్త గ్యాప్ ఇవ్వడంతో 2021 జనవరిలో సంక్రాంతి కానుకగా మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా క్రాక్ మాత్రమే సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా లో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రవితేజకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా మంచి రికార్డులను సొంతం చేసుకుంది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఐటెం సాంగ్ మరో ఎత్తు అని చెప్పాలి. ఒక సినిమాకు ఐటెం సాంగ్ అంటే ఎలా ఉండాలో కరెక్ట్ గా అలానే సూట్ అయింది. ఈ పాటలో లిరిక్స్ నుండి స్టెప్స్ వరకు ప్రతిదీ కూడా అద్బుతం అని చెప్పాలి.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి చాలా చక్కగా రాశారు. ఈ పాటలోని ప్రతి పదం మాస్ ను పరిచయం చేస్తుంది. అంతే అధ్బుతంగా ఈ పాటకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇంకేముంది మాస్ సాంగ్ లను పాడడంలో దిట్ట అయిన సింహ మరియు మంగ్లి లు ఈ పాటతో ఒక ఆట ఆడుకున్నారు. ఈ పాట "బూమ్ బద్దలు బూమ్ బద్దలు..." అంటూ మొదలవుతుంది. ఈ పాటలో మొదటి సారిగా ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి ఐటెం సాంగ్ లో నటించింది. చిన్న పిల్లవాడి నుండి పెద్ద వయసు వారి వరకు ఈ పాట వినిపిస్తే కాలు కదపాల్సిందే అంతలా ఇది వైరల్ అయింది. ఇప్పటికీ యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. రవి తేజ కెరీర్ లో ఒక సూపర్ డూపర్ హిట్ గా నిలచింది.