టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేసినా కూడా అక్కినేని అఖిల్ కు ఇంత వరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. మొదటి సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని భావించి వినాయక్ తో మాస్ సోషియో ఫాంటసీ సినిమా చేస్తే అది ఈ అక్కినేని హీరోకు భారీ డిజాస్టర్ ను ఇచ్చి ఆయనను తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. రెండో సినిమా గా క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా హల్లో సినిమా చేయగా చేసిన అది బాక్సాఫీసు వద్ద యావరేజ్ గా మిగిలింది.

సినిమా ఫలితం క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో లోపం వల్ల హలో అనే సినిమా యావరేజ్ గా నిలిచింది.  ఇక మూడో ప్రయత్నం గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేసి యావరేజ్ హిట్ కొట్టాడు. ఇలా మూడు సినిమాలు చేసినా కూడా అఖిల్ అభిమానులకు ఆకలి తీర్చే హిట్ మాత్రం దొరకలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాలుగో ప్రయత్నంగా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమాను చేస్తున్నాడు అక్కినేని అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం నుంచి ఇప్పటికీ ఓ పాట మరియు టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని అఖిల్. ఇదిలా ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ అంత బాగా రాలేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీంతో అక్కినేని అఖిల్ అభిమానులు మరొకసారి అఖిల్ ఫ్లాప్ ను చవి చూడక తప్పదా అని పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు ఇదైనా ఆయనకు హిట్ ను అందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: