అక్కినేని వారి ముద్దుల వారసుడు అక్కినేని అఖిల్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. 'బొమ్మరిల్లు' 'పరుగు' లాంటి ప్రజాదారణ పొందిన సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో అక్కినేని ఫాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మూవీ మేకర్స్.. తాజాగా ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.ఇక సినిమా ట్రైలర్ లో చూస్తే..మన అఖిల్ కొన్ని పెళ్లి చూపులకు వెళ్లడం.. అక్కడ అమ్మాయిలను తన చిలిపి ప్రశ్నలు అడగడం తెగ నవ్వు తెప్పిస్తోంది.ఇక ఆశ్చర్యంగా ఈ సినిమాలో కుర్ర హీరోయిన్స్ కనిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫారియా అబ్దుల్లా, ఈషా రెబ్బ కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు. 

ఇక బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో తన స్టైల్ లో ఏదో కొత్త పాయింట్ ని చెప్పబోతున్నారని తెలుస్తోంది. ట్రైలర్ లో అఖిల్ - పుజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ సూపర్ గా కుదిరినట్లు స్పష్టంగా తెలుస్తోంది.వీరి ఇద్దరి మధ్య కూడా ముద్దు సన్నివేశాలు ఇంకా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి.'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఇంకా పాటలు మంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి.ఇక ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేయడం జరిగింది.ఇక ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అలాగే గోపీసుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ప్రదీశ్ వర్మ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాడు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ - భాస్కర్ లకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: