
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్య సమంత కలిసి నటించిన మూడో చిత్రం ఆటోనగర్ సూర్య. అనంతరం చైతు సామ్ లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లి తర్వాత మొదటిసారిగా నటించిన చిత్రం మజిలీ. ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఇక సమత నటించిన ఓ బేబీ చిత్రంలో నాగ చైతన్య అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. అలా ఇది వీరు కలసి నటించిన ఐదో చిత్రంగా నిలిచింది. అలా ఈ సూపర్ హిట్ జంట ఐదు చిత్రాల్లో కలసి నటించి కనువిందు చేయగా ఇకపై తెలుగు ప్రేక్షకులకు ఆ అదృష్టం ఉందో లేదో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ వీరు మేము విడిపోయాం. కానీ మా మధ్య స్నేహం బంధం అలాగే కొనసాగుతుంది అన్న ఒక్క మాట కాస్త ఊరటనిచ్చింది.