సినిమాల ఎంపిక విషయంలో నిత్య రూటే వేరు.. చేతిలో అవకాశాలు ఉన్నా లేకున్నా.. తనకి నచ్చిన సినిమాలే చేస్తా అంటూ ..వచ్చిన మంచి మంచి అవకాశాలను వదులుకుంది. నిజానికి మహానటి సావిత్రి గారి బయోపిక్ లో కీర్తి సురేష్ కన్నా ముందు నిత్యానే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అమ్మడు చాలా కూల్ గా రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం కీర్తి సురేష్ కు వరించి.. ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కాగా ప్రస్తుతం..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్.. కండల వీరుడు రానా ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ గా చేస్తున్న మూవీ భీమ్లా నాయక్ లో హీరోయిన్ గా నటిస్తుంది నిత్యా మీనన్. ఇందులో పవన్ ను కంట్రోల్ పెట్టే భార్యగా నిత్య పర్ ఫామెన్స్ అదరగొట్టేసిందట. రీసెంట్ గా ఓ చిట్ చాట్లో పాల్గోన్న ఆమె..పవన్ తో పని చేయడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. "పవన్తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.మంచి అనుభూతినిచ్చిందని. భీమ్లానాయక్లో నాపాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో నేను భర్తను కమాండ్ చేసే పవర్ఫుల్ భార్య పాత్రలో కనిపిస్తా అంటూ చెప్పుకొచ్చింది నిత్యమీనన్.