మొట్టమొదటిసారిగా ప్రముఖ నటుడు జగపతిబాబు.. శరత్ కుమార్ ఇద్దరూ కలసి మొదటి తెలుగు సీరీస్ అయినటువంటి "పరంపర " లో నటించనున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 24వ తేదీన అంటే బుధవారం నాడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇక ఈ సీరీస్ కి నిర్మాతగా శోభు యార్లగడ్డ , ఆర్కే మీడియా వర్క్ ప్రొడక్షన్ అధినేత ప్రసాద్ దేవినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు కృష్ణ విజయ్ ఎల్ తో పాటు విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను హరి యేల్లేటి రచించారు.

సినిమాలో నవీన్ చంద్ర , ఇషాన్ తో పాటు ఆకాంక్ష సింగ్ కూడా నటిస్తున్నారు. అయితే ఆకాంక్ష సింగ్ తాజాగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయగా  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అదేమిటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు థాంక్యూ చెబుతూ మొదటిసారి పరంపర సిరీస్ ను  ప్రపంచవ్యాప్తంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. అంతే కాదు నా మొదటి సీరీస్ ను  నేను చూడడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాను.


ఇప్పుడే మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి అంటూ అందరికీ పిలుపునిచ్చింది. ఎపిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ టీంకి గుడ్ లక్ తెలిపాడు. ఇక ఈ సిరీస్ మొదటి సారిగా తెలుగు లో తెరకెక్కుతుండడంతో అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. అంతే కాదు రామ్ చరణ్ లాంటి ప్రముఖులు ఈ వెబ్ సిరీస్ కి సపోర్ట్ చేయడం,  జగపతి బాబు లాంటి స్టార్ హీరో కం విలన్ ఈ సినిమాలో నటించడం అన్ని కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: