సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటులు ఎప్పుడు.. ఏ విధంగా.. ఎవరితో.. ఎలా ప్రవర్తిస్తారో.. చెప్పడం చాలా కష్టం. మన ముందర చాలా చక్కగా మాట్లాడినా.. మనం వెళ్లిపోయిన తర్వాత మన గురించి చెడుగా దుర్భాషలాడుతూ చాలా నీచంగా చూస్తూ ఉంటారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇతరులతో తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఇక అంతే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో షూటింగ్ సమయంలో కూడా నటీ నటులకు.. దర్శకులకు గొడవలు జరుగుతూనే ఉంటాయి.

అసభ్యకర మాటలైనా కారణం కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్లనైనా గొడవలు జరిగినా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ ఒక దర్శకుడితో మొదట్లో గొడవపడి ఆ తర్వాత ఆమె పలకరించినా..ఆయన ఆమెతో మంచిగా మాట్లాడి ఆమె వెళ్ళిపోయిన తర్వాత చెడుగా మాట్లాడాడట.. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ సీనియర్ నటి గా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి కూతురే ఐశ్వర్య. ఈమె అప్పట్లో హీరో వినోద్ సరసన హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు దాసరి నారాయణ రావు, వినోద్ మామ అల్లుడు గా నటించిన మామగారు సినిమాలో కూడా యమునతో పాటు ఐశ్వర్య నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే చివరిగా ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత కీలక పాత్ర పోషించిన ఓ బేబీ సినిమాలో తన తల్లి లక్ష్మి తో కలసి ఐశ్వర్య నటించింది. ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న ఐశ్వర్య కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. ఈ షో లో ఆలీ ఐశ్వర్యను మీరు ఎవరినైనా కొట్టాలని అనుకున్నారా.. ఎప్పుడైనా.. అని అడగగా.. అవును ఆ దర్శకుడు పేరు అయితే చెప్పను కానీ.. ప్రముఖ దర్శకుడిగా గుర్తింపుపొందిన అతడు నాతో చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడు.

ఇక అప్పట్లోనే కొట్టాలని అనుకున్నాను.. కానీ వయసు చూసి వదిలేశాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కనిపించడంతో నేనే వెళ్లి స్వయంగా మాట్లాడాను.. కానీ నేను అటు తిరగగానే నా గురించి ఆయన చాలా చెడ్డ గా మాట్లాడాడు. అప్పుడు వదిలేసి తప్పు చేశాను.. విశ్వాసం లేని వ్యక్తి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: