- ఆధారం : రైటర్, ఎనలిస్ట్..తోట ప్రసాద్ ఆవేదన కు కొనసాగింపు మాత్రమే..
నేను కొద్దిగా మార్చి చెబుతున్నాను
కానీ వాస్తవంగా జరుగుతున్న పరిణామాలకు
తార్కాణమే.. ఈ కథన వస్తువు
నేను చాలా రోజుల కిందట ప్రసాద్ ల్యాబ్స్ కు పోయాను.. అక్కడ లెజెండ్ సెన్సార్ అవుతోంది. అప్పుడే అక్కడికి డైలాగ్ రైటర్ రత్నం వచ్చారు.. టీ పుచ్చుకునే సమయం.. సాయం సంధ్యా సమయం.. ప్రొడక్షన్ బోయ్ టీ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా డు..ఆయన విషయమై! వెంటనే ఆయన జోక్ చేశారు.. ఏమయ్యా ఇంకా సినిమా పూర్తి కానే కాలేదు అప్పుడే రైటర్ కు టీ తీసేశారా ఏంటి? టీ ఇవ్వొద్దని ప్రొడ్యూసర్ ఏమయినా ఆర్డర్ వేశారా ఏంటి? అంటూ నవ్వుతూనే చురకలు అంటించారు.. లేద్సార్ అంటూ ఆ కుర్రాడు బుర్ర గోక్కుంటూ పోయాడు.
ఓ రైటర్ ను గుర్తించడం గౌరవించడం అన్నవి బాధ్యతలు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా పేరు కనిపించడం లేదు అనే కన్నా వినిపించడం లేదు అని చెప్పడమే బెటర్.. ఈ మాట కూడా తోట ప్రసాద్ ఆవేదనతోనే రాశారు అక్కడ. ఇక మరో రచయిత,అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో లేరు..అని కూడా ఆయన చేసిన పరిశీలనే! మొత్తంగా ఇవాళ ఏ రైటర్ పేరు కూడా బలంగా వినిపించకపోవడానికి కారణం కథ - కథనం - మాటలు - దర్శకత్వం అనే నాలుగు విభాగాలూ తనవే కావాలన్న ఆత్రం తప్ప మరొకటి లేదు..అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.అందుకే రచయితకు కనీస ప్రాధాన్యం దక్కడం లేదు అన్నదే తోట ప్రసాద్ సర్ ఆవేదన.