ఈ మధ్య కాలంలో చాలా మంది బాలీవుడ్ తారలు అలాగే టాలీవుడ్ తారలు కూడా మాల్దీవులకు వెళ్లి అక్కడ తమ అందచందాలతో హీట్ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ ను మొదలుకొని కియారా అద్వానీ, సారా అలీ ఖాన్, పూజా హెగ్డే వంటి వారు తమ అందచందాలతో చూపరులకు మంచి వినోదాన్ని పంచుతారు. అంతేకాదు వీరు ధరించే బికినీలతో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు మతి పోగొడుతున్నారు. ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా వంతు అయింది. అయితే ఈమె వీరికి భిన్నంగా అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐస్ క్రీమ్ ట్రంక్ తో ఉన్న రిక్షా తొక్కుతూ తన అందాలతో హీటు పుట్టిస్తోంది కుర్రకారుకు.అంతే కాదు ఐస్ క్రీమ్ అంత ట్రంకు లోనే ఉంది.. ఎవరో కనిపెట్టండి అంటూ పజిల్ కూడా వేసింది తమన్నా. అయితే పాల నురుగు లాంటి అందం ముందు ఐస్ క్రీమ్ తేలిపోతుంది అంటూ ఇలా చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని మరీ ఇంత హాట్ ఫోజులు ఇస్తూ ఉంటే ఎలా అమ్మ తమన్నా అంటూ ఆమెను చూసి కుర్రకారు రాగాలు తీస్తున్నారు. ఇక మూవ్ అండ్ పిక్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ పేరిట ఈమె షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన ప్రతి ఒక్కరు తమన్నా ఏదైనా యాడ్ కోసం మాల్దీవుల్లో అడుగుపెట్టిందా.. లేక షూటింగ్లో భాగంగా అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందా అనే విషయం ప్రస్తుతం అందరినీ తికమకలో పడేసింది.

తాజాగా ఈమె సీటిమార్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎఫ్ 2  సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ఎఫ్3 షూటింగ్ లో బిజీగా ఉంది ఇక మే నెలలో వేసవికాలంలో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఎఫ్ 3 టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: