దర్శకుడు సంపత్ నంది గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ దర్శకుడు వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఏమైంది ఈ వేళలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ హీరో గా రచ్చ సినిమాను తెరకెక్కించాడు,  ఈ మూవీ తో దర్శకుడు సంపత్ నంది మంచి మాస్ కమర్షియల్ హిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  దర్శకుడు సంపత్ నంది ఆ తర్వాత బెంగాల్ టైగర్ ,  గౌతమ్ నంద , సిటి మార్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు,  ఇది ఇలా ఉంటే సంపత్ నంది  'సిటీ మార్'  మూవీ తో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  సంపత్ నంది టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ సీనియర్ స్టార్ అయిన  విక్టరీ వెంకటేష్ తో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే ఇప్పటికే దర్శకుడు సంపత్ నంది ,  విక్టరీ వెంకటేష్ కు ఒక కథ ను వినిపించినట్లు ఆ కథ విక్టరీ వెంకటేష్ కు కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి , వెంకటేష్ తో ఓ మూవీ ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని, సంపత్ నంది ని వెంకటేష్ దగ్గరకి పంపింది ఆయనేననే వార్తలు వినిపిస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు,  ఎఫ్ 3 సినిమా ఎఫ్ 2 సినిమా కు ప్రాంచేజి గా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: