ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎక్కువగా కే జి ఎఫ్-2 సినిమా గురించి వినిపిస్తోంది.. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం శాండిల్ వుడ్ లోనే కాకుండా.. అన్ని భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో యశ్ యాక్టింగ్ గురించి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

తాజాగా తమిళ హీరో అయిన రజినీకాంత్ కే జి ఎఫ్ చాప్టర్-2  సినిమాను చూసి ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించారు అంటూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కేజిఎఫ్ చిత్ర బృందానికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దర్శక నిర్మాతలకు కూడా ఫోన్ చేసి చాలా బాగుందని ప్రశంసించి నట్లుగా తెలుస్తున్నది. ఈ చిత్రం మొదటి రోజు  రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి నట్లు గా తెలుస్తోంది.

ఇక రెండు రోజులకి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఆదివారం రోజున దాదాపుగా  రూ.132 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం హిందీలో కూడా దుమ్ము లేపు తూ అక్కడ నటీనటుల ప్రశంసలు కూడా అందుకున్నాడు రాఖీ బాయ్. బాలీవుడ్లో కూడా ఇప్పటికి వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన్నట్లుగా సమాచారం. మరి రాబోయే రోజులలో ఈ చిత్రం మరెన్నీ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టడం ఖాయం అని విమర్శకులు సైతం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: