నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక విషయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా కొనసాగుతున్న నాని తాజాగా అంటే సుందరానికి మూవీ తో  ప్రేక్షకులను పలకరించాడు .

జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన అంటే సుందరానికి సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది . అంటే సుందరానికి మూవీ సెట్స్ పై ఉండగానే నాని 'దసరా' మూవీని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది . ఇది ఇలా ఉంటే నాని తాజాగా మరో సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే...  నాచురల్ స్టార్ నాని, మెర్లపాక  గాంధీ కాంబినేషన్ లో ఇది వరకే కృష్ణార్జున యుద్ధం సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన కృష్ణార్జున యుద్ధం సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అలా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .

అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని మరొక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు మేర్లపాక గాంధీ నాని కి ఒక స్టోరీ లైన్ ని వినిపించగా , ఆ స్టోరీ లైన్ నచ్చిన నాని మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు,  వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఈ ఓ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: