బాహుబలి సినిమా తర్వాత సత్యరాజ్ కట్టప్ప గా బాగా పాపులర్ అయ్యాడు. బాహుబలి పార్ట్ 1 తర్వాత ఈ పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించారు. ఎందుకు బాహుబలిని కట్టప్ప చంపాడు అని తలలు పట్టుకున్నారు. అందుకే ఈ పాత్రను ప్రేక్షకులు చాలా కాలం ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. అంతలా ఈ పాత్ర సినిమాను ప్రభావితం చేసింది. అయితే ఇతను స్వతహాగా తమిళ నటుడు అని తెలిసిందే. అయినప్పటికీ తెలుగు లోనూ కీలక పాత్రలు చేస్తూ ఇక్కడ కూడా తనకు అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. సత్యరాజ్ కు కూడా నటవారసుడు ఉన్నాడు. ఇతనిపేరు శిబిరాజ్... ఇంతకు ముందు కొన్ని సినిమాలలో సహాయక పాత్రలు చేసినా హీరోగా మాత్రం చేయలేదు. ఇప్పుడు హీరోగా ఒక సినిమాతో మన ముందుకు ఈ రోజు వచ్చాడు.  

మాయోన్ అనే హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నట్లే ఉంది. ఇందులో శిబిరాజ్ నటన ఆకట్టుకుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం విశేషం. ఇక లెజెండ్ మరియు అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ముఖ్యంగా ఇందులో దేవాలయానికి సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయట.

ఇక ఇందులో నటించిన అన్ని పాత్రలు పరిధిమేరకు నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. అలా మొత్తానికి సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ తొలి సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న కట్టప్ప అభిమానులు మా జూనియర్ కట్టప్ప హిట్ కొట్టాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: