టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన ఆది సాయికుమార్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించిన ఆది సాయి కుమార్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన కొత్తలోనే ప్రేమ కావాలి, లవ్లీ వంటి మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఈ యంగ్ హీరో ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ ఆ రేంజ్ విజయాలను అందుకోలేకపోయాడు. వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ ఆది సాయి కుమార్ కు సరైన విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది సాయి కుమార్ 'తిస్ మర్ ఖాన్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ  ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా, పూర్ణ సునీల్ ఈ మూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసింది. ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా తిస్ మార్ ఖాన్  సినిమా నుండి రెండవ టీజర్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలోని రెండవ టీజర్ ను రేపు అనగా జూలై 15 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాలోని రెండవ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: