టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయిన గోపీచంద్ మలినేని దర్శకుడిగా తన కెరియర్ ను మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్ శీను మూవీ తో మొదలు పెట్టాడు. మొదటి మూవీ లోని మాస్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న కథను ఎంచుకొని ఆ కథతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న గోపీ చంద్ మలినేని అప్పటి నుండి మాస్ కమర్షియల్ మూవీ లను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న గోపీచంద్ మలినేని పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ మూవీ తో మరో మాస్ కమర్షియల్ హిట్ ను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా బాలకృష్ణ కు కెరియర్ పరంగా 107 వ మూవీ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎన్ బి కే 107 అనే పేరుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ను మూవీ మేకర్స్ విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం గోపీచంద్ మలినేని కర్నూల్ లో ఉన్న అనేక ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ దర్శకుడు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.  ఇలా గోపి చంద్ మలినేని , బాలకృష్ణ 107 వ సినిమా లొకేషన్ ల కోసం ప్రస్తుతం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: