తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మలలో ఒకరు అయిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ , మహానటి మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది.

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. తెలుగు తో పాటు తమిళం లో కూడా అనేక మూవీలలో నటిస్తూ కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లలో కూడా ఫుల్ జోష్ ను చూపిస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కీర్తి సురేష్ నటించిన సాని కాయిధం అనే సినిమా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  అలాగే తాజాగా కీర్తి సురేష్ , మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా  కొంత కాలం క్రితమే విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ... విజయ్ సేతుపతి నటన అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే మణిరత్నం , రాజమౌళి , శంకర్  దర్శకత్వంలో నటించాలని ఉంది అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలా తాజా ఇంటర్వ్యూ లో కీర్తి సురేష్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: