ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో జబర్దస్త్ మొదలైన నాటి నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు గా రష్మీ నటించడం అటు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. దీంతో ఇక వీరిద్దరిని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు అభిమానులు. అయితే ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో తన యాంకరింగ్ తో అదరగొట్టడంతో పాటు సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ బాధ్యతలను కూడా రష్మీ తీసుకుంది అని తెలిసిందే. ప్రతివారం శ్రీదేవి డ్రామా కంపెనీ లో రష్మీ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే యాంకర్ రష్మి గౌతమ్ లేడీస్ దేవదాసుగా మారిపోయింది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తూలుతూ కనిపించింది. అయితే ఇది నిజ జీవితంలో కాదు ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో. అక్క బావ ఎక్కడ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చే వారం ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇటీవలే అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రోమో లో భాగంగా అక్కినేని లాగానే భుజం మీద శాలువా వేసుకుని మందు బాటిల్ చేతిలో పట్టుకొని బ్యాక్ గ్రౌండ్ లో ఎవరి కోసం అనే పాట వస్తూ ఉంటే ఇక దేవదాసు లా నటించింది యాంకర్ రష్మి. ఇది చూసిన తర్వాత సుధీర్ కోసం రష్మీ లా మారిపోయింది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.