యాంకర్ రష్మి.. నేటి రోజుల్లో ఈ అమ్మడు గురించి తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రష్మి పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. కానీ బుల్లితెరపై యాంకర్గా ప్రత్యక్షమైన తర్వాత మాత్రం రష్మీ ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించింది. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి దగ్గరయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు సుడిగాలి సుధీర్ తో ఉన్న లవ్ ట్రాక్  కారణంగా ఈ అమ్మడు ప్రేక్షకులకు అందరి కంటే కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయింది అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో తన యాంకరింగ్ తో ముద్దు ముద్దు మాటలతో  ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది యాంకర్ రష్మి.


 ఇకపోతే మొన్నటి వరకు జబర్దస్త్ లో మాత్రమే యాంకరింగ్ తో అదరగొట్టిన రష్మీ సుధీర్ వెళ్ళిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకరింగ్ బాధ్యతలను కూడా తీసుకుంది. దీంతో వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో భాగంగా రష్మీ తనమీద తానే సెటైర్లు వేసుకుంది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


బుల్లెట్ భాస్కర్ టీం స్కిట్ చేస్తున్న సమయంలో వర్షం మాట్లాడుతూ నేను యాంకర్ అంటే ఎవరూ నమ్మడం లేదు అంటూ ఒక కామెంట్ చేస్తుంది.. అంతలో స్పందించిన రష్మీ ఇప్పుడు వరకు నేను యాంకర్ అంటేనే నన్ను ఎవరూ నమ్మడం లేదు ఇక నిన్ను ఏం నమ్ముతారు అంటూ తనపై తానే సెటైర్ వేసుకుంటుంది. దీనిపై  స్పందించిన బుల్లెట్ భాస్కర్ మిమ్మల్ని యాంకర్ అంటే నమ్మడం లేదు దీన్ని అమ్మాయి అన్న కూడా ఎవరూ నమ్మడం లేదు అంటూ పంచ్ చేస్తాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. ఇక ఈ ప్రోమోలో చూసుకుంటే ఆటో గెటప్ శ్రీను మళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ లో కి రీ ఎంట్రీ ఇచ్చాడు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: