మొదటి చూపుల్లోనే ప్రేమలు కలగడం చాలా తక్కువ సందర్భాలలో అవుతుంటాయి.అయితే కొందరు మాత్రం మొదటి చూపుతోనే ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంటాయి.ఇక  అలా నటి సంగీత జీవితంలో కూడా జరిగిందట.  అసలు విషయం ఏంటంటే..టాలీవుడ్  సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్ సంగీత గురించి అందరికీ పరిచయమే.ఇక  అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించిన సంగీత.. సెకండ్ హీరోయిన్ గా కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో మాత్రం ఆ తరం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికి కూడా అంతే అందంతో ప్రేక్షకులకు దర్శనమిస్తూ ఉంటుంది.

అంఅంతేకాదు తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.అయితే ఈమె  పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషీగా, సంక్రాంతి వంటి ఫ్యామిలీ సినిమాల్లో నటించి ఆడియన్స్ కు బాగా దగ్గరయింది.ఇక  ఆ తర్వాత ఆమె కారా మజాకా సినిమాలో కనిపించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.అప్పటి నుంచి సినిమాల్లో కనిపించలేదు. సినిమా లకు గుడ్ బై చెప్పేసింది అనుకున్నారు అందరూ. ఇక అలా 10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సీనీ పరిశ్రమ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ తిరిగొచ్చింది.

ఇకపోతే ఈ సినిమా లో హీరోయిన్ తల్లిగా ఈమె నటించింది. ఇక ఈ సినిమా తో ఇంకా సంగీత లైఫ్ ఇంకో టర్న్ తీసుకుంది. కాగా ఈ సినిమా తర్వాత ఆమె బాగా ఫేమస్ అయ్యింది.ఇక ఆ తర్వాత నుంచి ఈమె కు బుల్లితెర లో కూడా పిలుపులు వచ్చాయి.ఈమె  బుల్లితెర లో షో లలో జడ్జ్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.  మసూద అనే చిత్రం లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఇక  ఇదిలా ఉంటే తాజాగా తను జడ్జిగా ఉంటున్న షో కు మహేష్ బాబు గెస్ట్ గా రాగా ఆయన ముందు తన లవ్ స్టోరీ గురించి తెలిపింది.అయితే ఓ అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు.. ఆ సమయం లో తన భర్తను మొదటిసారి చూసిందట. తన భర్త అవార్డు తీసుకోవడానికి వెళుతుండగా ఆయన స్టైల్ చూసి పడిపోయిందట. ఇక దీంతో అప్పుడే ఆయనను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట.  ఆమె ఆ విషయం చెప్పటంతో మహేష్ బాబు తెగ నవ్వుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.  సంగీత బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా బాగా బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: