ఇటీవలే వచ్చిన విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ను విడుదల చేశాడు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయిందని చెప్పాలి. కంటెంట్ లో లోపం వల్ల సినిమా ఏమాత్రం నిలబడలేకపోయింది. అలా ఈ సినిమా లో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించినా కూడా ఏమాత్రం అది నిలబడలేకపోయింది. అలా ఈ లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి వారం తిరగకముందే ప్యాక్ అప్ చెప్పేసుకుంది.

పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గా కరణ్ జోహార్, చార్మి కౌర్ నిర్మాతలుగా రూపొందిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. అన్ని భాషల్లో ఈ సినిమా దారుణంగా ఫలితాన్ని అందుకుంది. తెలుగు లో రౌడీ పై ఉన్న నెగెటివిజానికి ఏమాత్రం తట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు విజయ్ నటించబోయే తదుపరి సినిమాపైనే ఉంది. ఇక విడుదలకు ముందు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడే విధంగా ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ఒక రేంజ్ లో సినిమాలపై అంచనాలు పెంచేసింది. అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది సినిమా బృందం.

అలా ఈ సినిమా గురించి అందరు మరిచిపోతున్న క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్లాప్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ముందు వెళ్లడం అందరిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. అయన అభిమానులలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.  ఇకపోతే  లైగర్ సినిమా కూడా విడుదల కాకుండానే పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా కూడా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఉందో లేదో ఆ సినిమా ఇంకా తెలియదు. ఏదేమైనా విజయ్ దేవరకొండ సైమా, యాడ్స్ అంటూ మూవ్ అయిపోతున్నాడు అని చెప్పాలి. మరి ఇప్పుడు చేస్తున్న ఖుషి సినిమా తో అయన ప్రేక్షకులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటాడో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో కూడా అయన ఓ సినిమా చేస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: