ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కలయికలో  వచ్చిన మూడవ సినిమా 'పుష్ప ది రైజ్'. ఈ సినిమా భారీ అంచనాల మధ్య హడావిడీగా విడుదలైన ఈ మూవీ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.ఇక పార్ట్ 1 అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడంతో పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి హ్యూజ్ క్రేజ్ ఏర్పడింది.అయితే  ఈ మూవీ రిలీజ్ తరవాత నుంచి తనకు లభించిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ కమర్షియల్ బ్రాండ్ అకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి వరుస కమర్షియల్ యాడ్ షూట్ లతో బిజీగా వున్నారు అల్లు అర్జున్.ఇకపోతే ప్రస్తుతం 'పుష్ప 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 

ఇదిలా ఉంటె రీసెంట్ గా ఈ మూవీకి లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపిన విషయం తెలిసిందే.ఇక  త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది.అయితే  ఫస్ట్ పార్ట్ రికార్డు కార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో పార్ట్ 2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక  ఇప్పటికే ముందు అనుకున్న బడ్జెట్ ని రెండింతలు చేసిన మేకర్స్ పార్ట్ 2 కోసం రూ.350 కోట్లు ఖర్చు చేయబోతున్నారట.ఇకపోతే త్వరలో ప్రారంభం కానున్న 'పుష్ప 2'పై గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి.ఇదిలావుంటే ఇక  ఈ సినిమాలోని ఒక  ప్రత్యేక గీతం కోసం ఐటమ్ నంబర్స్ స్పెషలిస్ట్ మున్నీ ..

మలైకా అరోరాని దించేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.  పార్ట్ 1 ని శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు.కరోనా కారణంగా ఆ ప్లాన్ బెడిసికొట్టింది. అయితే చివరికి మారేడుమిల్లి ఫారెస్ట్ లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఇక పార్ట్ 2 ని అలా కాకుండా భారీ స్కేల్ లో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పార్ట్ 2 కోసం ఏ అడవిని ఎంచుకోవాలన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: