రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వర్షం సినిమా కూడా ఒకటి. 2004 వ సంవత్సరంలో విడుదల అయిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించి కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. వర్షం మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ కి శోభన్ దర్శకత్వం వహించగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ మూవీ ని ఎం ఎస్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో గోపీచంద్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ప్రభాస్ కి , త్రిష కి , గోపీచంద్ కి , దేవి శ్రీ ప్రసాద్ కి ఇలా చాలా మంది కి అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇలా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 22 మరియు 23 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి ఇప్పటికే తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను అందుకున్నాయి. మరి వర్షం సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: