చిత్ర పరిశ్రమలో వారసత్వం వెరీ కామన్. హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతల పిల్లలు పరిశ్రమలో రాణించాలని ఆశపడతారు.
టాలీవుడ్ లో హీరోల కూతుళ్లను హీరోయిన్స్ చేసే సంప్రదాయం లేదు. ఈ మధ్య ఈ రూల్ కొందరు బ్రేక్ చేస్తున్నారు. నాగబాబు కూతురు నిహారిక, రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య హీరోల పిల్లలు సోషల్ మీడియాలో పాపులర్ కావడం ఎక్కువైంది. మహేష్ డాటర్ సితార, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ విషయంలో ముందున్నారు. సితార సపరేట్ గా సోషల్ మీడియా అకౌంట్స్ మైంటైన్ చేస్తున్నారు.
అర్హను వాళ్ళ నాన్న అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక బాలనటిగా అర్హ ఎంట్రీ కూడా జరిగిపోయింది. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా సితార సైతం వెండితెరకు పరిచయం కానున్నారట. ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సర్వం సిద్ధం అంటున్నారు. మహేష్ దీని కోసం ప్రణాళిక సిద్ధం చేశారు.

సర్కారు వారి ప్రమోషనల్ సాంగ్ లో సితార తళుక్కున మెరిశారు. నెక్స్ట్ ఆమె పూర్తి స్థాయిలో ఒక చైల్డ్ రోల్ చేయనున్నారట. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 మూవీ దీనికి వేదిక కానుందట. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో సితార నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కథలో కీలకమైన చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ సితార చేయనున్నారట. ఈ మేరకు మహేష్ నిర్ణయం తీసుకున్నారట.
SSMB 28వ చిత్రంలో సితార నటించడం ఖాయమే అంటున్నారు. మహేష్ కూతురుగానే కాకుండా సితార తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు సితార చిన్నప్పుడే తన టాలెంట్ చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. డాన్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ చాలా యాక్టీవ్ గా ఉంటారు. దర్శకుడు వంశీ కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది. ఇక SSMB 28 మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, త్వరలో సెకండ్ షెడ్యూల్ కి వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: