బాలయ్య చాలా రొమాంటిక్ అని మరోసారి నిరూపించుకున్నాడు.యంగ్ హీరోయిన్ రష్మిక మందాన నా క్రష్ అంటూ తన క్రేజీ ఫీలింగ్ బయటపెట్టాడట.. బాలకృష్ణ కామెంట్ వైరల్ గా మారింది.


బాలయ్య సారథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 సంచనాలకు సిద్ధం అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్య తన బంధువులైన నారా చంద్రబాబు, లోకేష్ లను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారట.ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ రికార్డు వ్యూస్ రాబడుతోంది.


 

ఇక వరుసగా పలువురు సెలెబ్రిటీలతో అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ రెడీ చేశారు. కాగా ఎపిసోడ్ 2 గెస్ట్స్ గా యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. విశ్వక్, సిద్ధూలతో బాలయ్య సంభాషణ చాలా ఎంటర్టైనింగ్ సాగింది. అమ్మాయిలతో అఫైర్స్ నుండి మద్యపానం వరకు అనేక ఆసక్తికర విషయాలయితే చర్చకు వచ్చాయి.


 

అమ్మాయిని ఎలా పడేయాలో కొన్ని టిప్స్ చెప్పమని బాలయ్య వారిద్దరినీ అడిగారట.. అనంతరం సిద్ధు... ప్రజెంట్ హీరోయిన్స్ లో మీ క్రష్ ఎవరని బాలయ్యను అడిగారు. దానికి బాలయ్య తడుముకోకుండా రష్మిక మందాన అంటూ ఆన్సర్ చెప్పారు. దీంతో ఆడియన్స్ తో పాటు , ఇద్దరు హీరోలు కూడా షాక్ అయ్యారు.


 

అరవై ఏళ్ల బాలయ్య, 25 ఏళ్ల రష్మికపై మనసు పడడం నిజంగా ఊహించని పరిణామమే. నిజానికి బాలయ్య నిత్య యవ్వనంగా ఫీల్ అవుతారు. మనవళ్లు మనవరాళ్ల చేత కూడా తాత అని పిలిపించుకోడు. ఈ మధ్య ఓ అమ్మాయి బాలయ్యను మామయ్య అని పిలుస్తా అన్నారు. మనవళ్లతోనే నేను తాతయ్య అనిపించుకోను, వాళ్లు నన్ను బాలా అని పిలుస్తారని చెప్పుకొచ్చాడట.


 

ఈ లెక్కన తన సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైతే బాలయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. కెరీర్ లో వందల మంది హీరోయిన్స్ ని చూసిన బాలయ్య రష్మిక తన క్రష్ అని చెప్పడం విశేషంగా మారిందట.. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: