ప్రముఖ టీవీ నటి వైశాలి టక్కర్ ఇక లేరు . ఇండోర్‌లోని తన ఇంట్లో   ఆత్మహత్య చేసుకుంది నటి వైశాలి .
ప్రముఖ టీవీ నటి వైశాలి టక్కర్ ఇక లేరు. ఇండోర్‌లోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వైశాలి తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వైశాలి గత సంవత్సరం నుండి ఇండోర్‌లో నివసిస్తున్నారు. వైశాలి టక్కర్ ససురాల్ సిమార్ కాలో అంజలి భరద్వాజ్, సూపర్ సిస్టర్స్‌లో శివాని శర్మ, విషా అమృత్: సితారలో నేత్ర సింగ్ రాథోడ్, మన్మోహిని 2లో అనన్య మిశ్రా పాత్రలో నటించి మంచి పేరు ను తెచ్చుకున్నారు.

వైశాలి టక్కర్ టీవీలో తొలిసారి స్టార్ ప్లస్ వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో ఆమె 2015 నుండి 2016 వరకు  నటి సంజనగా పాత్రలో నటించింది. 2016లో ఆమె యే హై ఆషికిలో బృందాగా నటించింది. ఆమె చివరిసారిగా రక్షాబంధన్ అనే టీవీ షోలో కనక్ సింగ్‌సాల్ సింగ్ ఠాకూర్ పాత్రలో కనిపించింది మరీ, నటి ఇన్‌స్టాగ్రామ్‌లో తన రోకా వేడుక వీడియోను  తెగ షేర్ చేసింది. తన కాబోయే భర్త డాక్టర్ అభినందన్ సింగ్ పేరును కూడా వెల్లడించింది. ఈ ఫంక్షన్‌కు కేవలం దంపతుల సన్నిహిత కుటుంబ సభ్యులు  కొంత మంది మాత్రమే హాజరయ్యారు

 భర్త అభినందన్ కెన్యాకు చెందిన డెంటల్ సర్జన్. అయితే, ఒక నెల తరువాత, వైశాలి తాను అభినందన్‌తో పెళ్లి చేసుకోబోనని అందరికీ తెలియజేసింది ఈ నటి . ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన వివాహాన్ని ఈ జంట రద్దు చేసుకున్నారు అని తెలుస్తుంది . నటి తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి తన రోకా వేడుక వీడియోను తొలగించింది మరి. ఐదు రోజుల క్రితం, వైశాలి టక్కర్ ఈ ఫన్నీ రీల్‌ను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమెఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన వీడియోలు, చిత్రాలను తెగ షేర్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: