తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ సంవత్సరం లైగర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లేగర్ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో అనన్య పాండే , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా మూవీ గా లైగర్ మూవీ ని తెరకెక్కించారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయగా , ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర చెప్పుకో దగ్గ కలెక్షన్ లు కూడా రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ,  సమంత హీరోయిన్ గా శివ నార్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ "జెర్సీ" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గౌతమ్ తిన్నానూరి ,  విజయ్ దేవరకొండ కు ఒక కథను వినిపించగా ,  ఆ కథ బాగా నచ్చిన విజయ్ దేవరకొండ వెంటనే గౌతమ్ తిన్ననూరి  దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి , విజయ్ దేవరకొండ తో అదిరిపోయే పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: