టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం అయితే లేదు. ప్రస్తుతం రెండేళ్లకు గానూ ఒక సినిమాలో నటిస్తున్న ఈయన..

ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో విజయం అందుకుని.. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుని అభిమానుల మెప్పు పొందుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమాగా ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. ఇదిలా వుండగా తాజాగా మహేష్ ఖాతాలో మాత్రం అరుదైన రికార్డ్ చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ఫాలోయర్ల సంఖ్య 13 మిలియన్లకు చేరుకోవడం గమనార్హం. సౌత్ ఇండియాలో మరో స్టార్ హీరోకు సోషల్ మీడియా ఈ స్థాయిలో అభిమానులు లేరు.

ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో అభిమానులు ఉండడంతో ఇతర స్టార్ హీరో లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా మహేష్ బాబు సెట్ చేసిన రికార్డును మరే స్టార్ హీరో అయిన రాబోయే రోజుల్లో బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది . కానీ ప్రస్తుతం ఈ టార్గెట్ ను మరే స్టార్ హీరో రీచ్ అవ్వలేరు అని స్పష్టం అవుతోంది. మరొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే మహేష్ బాబు మాత్రం సోషల్ మీడియా కేవలం 30 మందిని మాత్రమే ఫాలో అవుతూ ఉండడం. మహేష్ బాబు ఇలాంటి మరెన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకోవాలి అని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలి అని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోకిరి సినిమా విడుదలైన రోజునే ఈ సినిమాను కూడా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.ఇక మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఒక్కో ప్రాజెక్ట్ కి 80 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి రికార్డులు మహేష్ బాబుకు మాత్రమే సాధ్యం అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళితో యాక్షన్ డ్రామా మూవీని తెరకెక్కించబోతున్నారటా మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: