సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ప్రస్తుతం కొన్ని కోట్ల రెమినరేషన్ తీసుకుంటున్నట్లు మనకు తెలిసిందే. ఒక సినిమాలో చేయాలంటే రజనీకాంత్ 100 కోట్లు డిమాండ్ చేసినా కూడా అంతా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారట దర్శకనిర్మాతలు.

అయితే రజనీకాంత్ ఒకానొక సందర్భంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటే ఆయనను రైల్వే కూలీలు ఆ ఇబ్బంది నుండి గట్టెక్కించారట. ఇక ఈ సంఘటన రజనీకాంత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే జరిగిందట. ఇక దాని గురించి రజనీకాంత్ మాట్లాడుతూ..

నేను ఎస్సెసెల్సి చదువుకునే టైంలో మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఎగ్జామ్ కోసం అని 150 రూపాయలు ఇచ్చి పంపించారు.కానీ ఆ పరీక్షలో ఎలాగైనా ఫెయిల్ అవుతానని నాకు ముందే తెలుసు. అందుకే నేరుగా మద్రాస్ రైలు ఎక్కాను. కానీ రైల్లో జర్నీ చేసే టైంలో నా టికెట్ ఎక్కడో పడిపోయింది. ఇక టికెట్ ఇన్స్పెక్టర్ కి నా టికెట్ ఎక్కడో పడిపోయింది అని చెప్పినా కూడా నన్ను కచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే అని గట్టిగా చెప్పారట.. ఇక టిసి నా మీదకు గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న ఐదుగురు రైల్వే కూలీలు నా జరిమానా కడతామని ముందుకు వచ్చారట.. కానీ మీరు నేనసలు టికెట్ తీసుకోలేదు అనుకుంటున్నారేమో. నేను టికెట్ తీసుకున్నాను కానీ అది ఎక్కడో పడిపోయింది.

నేను ఆ విషయం చెప్పినా కూడా మీరు నమ్మడం లేదు అని నేను టీసి తో చాలా మొత్తుకున్నాను. ఇక అలా కాసేపు వాదించడంతో టిసి నన్ను నమ్మారు. కానీ నా లైఫ్ లో తెలియని వ్యక్తి నన్ను నమ్మడం అదే ఫస్ట్ టైం. కానీ నా మొహం కూడా తెలియకుండా నన్ను నమ్మిన వ్యక్తి ఎవరో కాదు బాలచందర్. ఆయన నమ్మకాన్ని నేను గెలిపించాను. ప్రస్తుతం నాపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని కూడా గెలిపించాను గెలిపిస్తూ ఉన్నాను కూడా. వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను అంటూ రజనీకాంత్ ఆ ఇంటర్వ్యూలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారట . ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: