తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ , అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా  నటించింది. ఈ మూవీ లో సునీల్ ,  వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 4 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. 

దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఊర్వశివో రాక్షసివో మూవీ మంచి టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మంచి కలక్షన్ లను వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఊర్వశివో రాక్షసివో మూవీ యూనిట్ తాజాగా యూత్ ఫుల్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ను నవంబర్ 6 వ తేదీన ఆదివారం రోజు "జే ఆర్ సి" కన్వెన్షన్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ,  ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ విచ్చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: