ఇక చిరంజీవి రాజకీయాల నుండి తిరిగి వచ్చి ఖైదీ నెంబర్ 150 తో కమ్ బ్యాక్ ఇచ్చి అభిమానులలో మరి ఉత్సాహాన్ని నింపారు. ఇకడ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. అయితే చిరంజీవి గతంలో నటించిన మాస్ సినిమాలో పాత్రలోని చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఇక ఈ టైటిల్ లోనే బోలెడంత మాస్ ఉందని గత కొద్దిరోజులుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ను చూడగానే ఈ విషయాన్ని చెప్పవచ్చు. చిరంజీవి పూర్తిస్థాయిలో మాస్ లుక్ లో కనిపించబోతున్నారని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాకు సంబంధించి పలు అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు చిత్ర బృందం. ఇక తాజాగా దేవిశ్రీప్రసాద్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీరయ్య సినిమా నుంచి ఒక ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు ఈ పాటకి బాస్ పార్టీ అనే ట్యాగ్ ను తగిలించి దేవి శ్రీ ఒక్కసారిగా హైప్ ని పెంచారు. ఇక ఈ పాట కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.