టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగపతి బాబు , అర్జున్ ప్రధాన పాత్రలలో తేరకేక్కిన హనుమాన్ జంక్షన్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని ,  అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు , ఆ తర్వాత తమిళ మూవీ లకు దర్శకత్వం వహించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మోహన్ రాజా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

గాడ్ ఫాదర్ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. తమన్మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ గాడ్ ఫాదర్ మూవీ ఈ సంవత్సరం దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాక ముందు మోహన్ రాజా దర్శకత్వం లో నాగార్జున హీరో గా ఒక మూవీ కన్ఫామ్ అయినట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కే అవకాశం లేనట్లే అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం  ది ఘోస్ట్ మూవీ కి "ఓ టి టి" లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: