టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బావరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో రాజా వారు రాణి గారు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత సెబాస్టియన్ , సమ్మతమే , నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ లలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కిరణ్ అబ్బవరం నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో సమ్మతమే సినిమా కాస్త పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించినప్పటికీ మిగతా రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో వరస మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణు కథ" అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో అయినా కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: