సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం మహేష్ బాబు , పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. సర్కారు వారి పాట మూవీ లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా తమన్మూవీ కి సంగీతం అందించాడు. సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

మూవీ లో పూజా హెగ్డే , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కనిపించనుండగా , తమన్మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయినటు వంటి విక్కీ కౌశల్ ను తీసుకోవాలని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని విలన్ పాత్ర చాలా హైలెట్ గ మరియు పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు , ఆ పాత్రకు విక్కీ కౌశల్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు అని మూవీ యూనిట్ అనుకోవడంతో విక్కీ శౌషల్ ను ఈ మూవీ లో విలన్ గా తీసుకోవడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: