'నేనెవరు' చిత్రం విడు దల కోసం చాలా ఆత్రం గా ఎదురు చూస్తు న్నామని చెబుతున్నారు ఈ చిత్ర హీరో హీరోయిన్లు కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్, తన్నీరు రాం బాబు ఎంత తపన పడ్డారో  తాము ప్రత్యక్షం గా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధ తో   తీర్చిదిద్దారని వారు తెలిపారు. ఈ చిత్రంలో ని పాటల కు, టీజర్ మరి యు ట్రైలర్ కు అనూ హ్య స్పందన రావడం.. 'నేనెవరు' చిత్రం సాధించబో యే ఘన విజయాని కి సంకేతం గా భావిస్తు న్నామని అన్నారు. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటిం గ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోష నల్ గా ఫీల్ అవుతు న్నానని కోలా బాల కృష్ణ చెప్పారు.

నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం లో కౌశల్ క్రియే షన్స్ పతాకం పై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తం గా నిర్మిం చిన 'నేనెవరు' డిసెంబర్ 2న విడుదల వుతోంది. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొం దిన ఈ చిత్రాని కి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూ రి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబ లి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిం చారు. రాధగోపి తన యుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడి గా పరిచయం అవుతు న్నారు.

ఈ చిత్రం లో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిం చారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం 'నే నెవరు' కావడం విశేషం. ఈ చిత్రాని కి సినిమా టోగ్రాఫర్ గా సామల భాస్కర్ వ్యవ హరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: