షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సుజిత్ రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సొంతం చేసుకున్నాడు.ఫుల్ అంటర్టైన్ గా  తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో పాటు సినిమాలో అనేక ట్విస్టులో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విజయంతో సుజిత్ కు సాహో సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఇక సాహూ సినిమాను సుజిత్ ఎంతో బాగా తిరకేకిచ్చినప్పటికీ 

హిందీ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా వల్ల సుజిత్ పై భారీ స్థాయిలో విమర్శలు కూడా రావడం జరిగింది. దీంతో అవకాశాలు ఇచ్చే హీరోలు నిర్మాతల సంఖ్య తగ్గిపోయింది అని చెప్పాలి. ఇక ఈయన టాలెంట్ను నమ్మి దర్శకులకు ఛాన్స్ ఇచ్చే పవన్ సుజిత్ కు కూడా ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. అయితే పవన్ సుజిత్ దానయ్య కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసింది కదా. కాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల రావడం జరిగింది. ఇక హరిహర వీరమల్లో షూట్ పూర్తయిన వెంటనే

పవన్ ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టనున్నాడట. అయితే ఈ సినిమా మొదలైన 20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా కనిపించడట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ చాలా తక్కువగా ఉంటుంది అని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 70 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ సుజిత్ కాంబినేషన్లో ఫ్యాన్ ఇండియా సినిమాగా ఎక్కుతుందా లేదా అనే స్పష్టత ఇంకా రాలేదు .ప్రస్తుతం పవన్ రేంజ్ అంతకంతకు పెరుగుతుండడంతో ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక పవన్ క్రేజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే ప్రస్తుతం ఇటు సినిమాలు మరియు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: